సూర్యాపేటలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

by Disha Web Desk 12 |
సూర్యాపేటలో అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి
X

దిశ, సూర్యాపేట: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం తెల్లవారుజామున సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మున్సిపాలిటిలోని సుందరయ్యనగర్‌లో అర్ధరాత్రి ఆకారపు శేఖర్ (37) వివాహాని హాజరై బయటకొచ్చాడు. తీరా చూస్తే గురువారం తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. మృతదేహం లబించిన ప్రదేశంలో.. పగిలిన బీరుసీసాలు లభించడంతో శేఖర్‌ను హత్యచేసి ఉంటారని బందువులు ఆరోపిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. వేరే ప్రాంతంలో హత్య చేసి ఇక్కడ పడేశారా.. లేదా శేఖర్ ఆత్మహత్య చేసుకున్నారా.. అనే కోణంలో డీఎస్పీ నాగభూషణం, సీఐ రాజశేఖర్ దర్యాప్తు ప్రారంభించారు. అలాగే మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.


Next Story