మేళ్లచెరువు‌లో జాతీయ కబడ్డీ క్రీడకారులు హల్ చల్

by Disha Web Desk 12 |
మేళ్లచెరువు‌లో జాతీయ కబడ్డీ క్రీడకారులు హల్ చల్
X

దిశ, మేళ్లచెరువు: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులోని శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి మెన్స్ ఇన్విటేషన్ కబడ్డీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ సెంట్రల్ రైల్వే, రంగారెడ్డి, మహబూబ్నగర్ వంటి టీం లతో పాటుగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో ప్రముఖ 6 కబడ్డీ టీములు పాల్గొంటున్నాయి.

ఈ పోటీల ప్రారంభోత్సవానికి ప్రో కబడ్డీ జాతీయ క్రీడాకారులు సిద్ధార్థ దేశాయ్, మల్లికార్జున్,( తెలుగు టైటాన్స్) మోను సంధు(పట్నా పైరేట్స్) అసు సింగ్(యుపి యోధ) వంటి అంతర్జాతీయ కబడ్డీ పోటీల్లో పాల్గొన్న ప్రముఖ ఆటగాళ్లు సౌత్ సెంట్రల్ రైల్వే కబడ్డీ టీం నుండి పాల్గొని ఆడారు. మేళ్లచెరువు నిర్వహిస్తున్న కబడ్డీ టోర్నమెంట్‌కు పేరుందిన కబడ్డీ క్రీడాకారుల పాల్గొంటున్నందున ఈ కబడ్డీ క్రీడను చూసేందుకు పెద్ద సంఖ్యలో కబడ్డీ అభిమానులు ప్రాంగణానికి చేరుకున్నారు. క్రీడాకారులతో, కబడ్డీ అభిమానులు ప్రాంగణంలో సెల్ఫీ పోటోలతో హంగామా సృష్ఠించారు.


Next Story

Most Viewed