బైక్ ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి

by Kavya |
బైక్ ను ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి
X

దిశ, చివ్వేంల : కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన సంఘటన మండలంలోని గుంజలూరు స్టేజి వద్ద చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దాసాయిగూడెం గ్రామానికి చెందిన బిక్షం(53) నామవరం గ్రామానికి ఫంక్షన్కు వెళ్లి ద్విచక్ర వాహనంపై గుంజలూరు స్టేజి వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాదు నుంచి విజయవాడ వెళుతున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం సూర్యాపేట జిల్లా ఆస్పత్రికి తరలించడం జరిగింది.మృతుని భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




Next Story