బైక్ ను ఢీకొన్న లారీ : వ్యక్తి మృతి

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-17 10:26:15  IST  )

అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన

బైక్ ను ఢీకొన్న లారీ : వ్యక్తి మృతి
X

బైక్ ను ఢీకొన్న లారీ : వ్యక్తి మృతి

- అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తుండగా ఘటన

- నేరేడుచర్ల మండలం పత్తేపురంలో విషాదం

దిశ గరిడేపల్లి : బైక్ ను లారీ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం పత్తేపురం గ్రామానికి చెందిన ఊరే శ్రీనివాస్ పొనుగోడులోని తన అత్తగారింటికి ఓ పని నిమిత్తం వెళ్లి తిరిగి స్వగ్రామం వస్తున్నాడు. ఈ క్రమంలో సూర్యాపేట వైపు నుంచి వస్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో గరిడేపల్లి మండలం కేంద్రంలోని పొనుగోడు రోడ్డులో గల ఎంబీఆర్ ఫంక్షన్ హాల్ వద్ద శ్రీనివాస్ ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య కళావతి, కుమార్తె ఉంది. శ్రీనివాస్ మృతితో పత్తేపురంలో విషాదం నెలకొంది.

Next Story