- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జీవిత ఖైదీని పట్టుకున్న పోలీసులు..

దిశ హుజూర్ నగర్ / మఠంపల్లి : ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉండి పెరోల్ పై బయటికి వచ్చి ఆ తర్వాత ఆరు సంవత్సరాల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకోని తిరుగుతున్న నిందితుని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా ఎస్పీ కె.నరసింహ ఐపీఎస్ శుక్రవారం కోదాడ డి.ఎస్.పి శ్రీధర్ రెడ్డి తో కలిసి మీడియాకు పూర్తి వివరాలను వెల్లడించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం కోదాడ సబ్ డివిజన్ పరిధిలోని మఠంపల్లి మండలానికి చెందిన బొడ్డుపల్లి తిరుపతి 2012 సంవత్సరంలో, రాచకొండ (అప్పటి సైబరాబాద్) కమిషనరేట్ లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయ్యాడు.2015 లో రంగారెడ్డి జిల్లా 3 వ అదనపు సెషన్స్ కోర్టు వారు, విచారణ అనంతరం తిరుపతికి జీవిత ఖైదు శిక్ష విధించి చర్లపల్లి జైలుకు పంపించడం జరిగింది. ఆ తర్వాత 2019లో అతను పెరోల్ పై బయటికి వచ్చి తప్పించుకొని తిరగడం జరుగుతుందని తెలిపారు.చర్లపల్లి జైలు సూపరింటెండెంట్ గత సంవత్సరం (2024)లో మఠంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అప్పటినుంచి ఈ కేసు పెండింగ్ లోనే ఉంది. పెండింగ్ కేసుల వివరాలను పరిశీలిస్తున్నఐపీఎస్ నరసింహ దృష్టికి ఈ కేసు వెళ్లింది. ఎస్పీ నర్సింహ ఈ కేసును ఎలాగైనా ఛేదించాలని... కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి కి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూచనల సలహాల మేరకు, కోదాడ డీఎస్పీ ఎం. శ్రీధర్ రెడ్డి కేసును లోతుగా అధ్యయనం చేసి, అందుబాటులో ఉన్న తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని డేటాబేస్లను ఉపయోగించి సీఐ సెల్ ఎస్సై, సూర్యాపేట ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్సహాయంతో నిందితుడు బొడ్డు తిరుపతిని శుక్రవారం గుంటూరులో గుర్తించి అరెస్ట్ చేయడం జరిగిందని వివరించారు.పరారీలో ఉన్న నిందితుడు బొడ్డు తిరుపతి తన బంధుత్వాలు అన్ని వదులకొని.. తన పూర్తి వివరాలను ఎవరికీ తెలియకుండా దాచిపెట్టి గుంటూరుకు చెందిన ఒక వితంతువు మహిళను వివాహం చేసుకున్నాడని తెలిపారు. గుంటూరులో ఒక హోటల్లో పనిచేస్తూ చేస్తున్నాడని తెలిపారు. హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు అధ్వర్యంలో పోలీసు బృందం మఠంపల్లి ఎస్సై పి. బాబు, కానిస్టేబుల్ రామారావు శంబయ్య గుంటూరు జిల్లాలో జీవితఖైదీ అనుభవిస్తున్న నేరస్థున్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారని తెలిపారు.