స్వయం అనుభవం కోసమే స్వపరిపాలన..

by Dishanational1 |
స్వయం అనుభవం కోసమే స్వపరిపాలన..
X

దిశ, నేరేడుచర్ల: విద్యార్థులకు స్వయంగా అనుభవం కోసమే స్వపరిపాలన దినోత్సవం నిర్వహించినట్ల నేరేడుచర్ల పట్టణంలోని అంజలి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపాల్ అలక సైదిరెడ్డి, డైరెక్టర్ సుంకర క్రాంతికుమార్ లు అన్నారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ఒక్కరోజు పాలనలో విద్యార్థులు నాయకులుగా ప్రజాప్రతినిధులుగా అధికారులుగా ఉపాధ్యాయులుగా తమ పాత్రలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకున్నారని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకుని భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని వారు ఆకాంక్షించారు. ఈ స్వపరిపాలన దినోత్సవంలో సీఎంగా జి. జస్వంత్, మంత్రిగా ఎస్. సింధు, విద్యాశాఖ మంత్రిగా జి. హైందవి, విద్యుత్ శాఖ మంత్రిగా సిహెచ్. రామ్ చరణ్, ఎంపీగా పి. వంశీ, ఎమ్మెల్యేలుగా వి. సుమంత్, కే. సిరి మోక్షజ్ఞ, ఎమ్మెల్సీగా సాయి, జడ్పీ చైర్మన్ గా లిఖిత, కలెక్టర్ గా బెనజీర్, జాయింట్ కలెక్టర్ గా పూజిత, ఆర్డీవోగా షబానా, మున్సిపల్ చైర్మన్ గా సంజయ్, జడ్పీటీసీగా పవన్ లు వ్యవహరించారు. స్వపరిపాలన దినోత్సవంలో పాల్గొన్నవారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.





Next Story