కాంగ్రెస్ పార్టీ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.. కుందూరు జై వీర్ రెడ్డి

by Web Desk |
కాంగ్రెస్ పార్టీ వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుంది.. కుందూరు జై వీర్ రెడ్డి
X

దిశ, హాలియా: హాలియా పట్టణ కేంద్రలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్చింతల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుందూరు జై వీర్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బూత్ ఎన్రోలర్ ద్వార ప్రతి గ్రామంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు, నిరుపేద కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సభ్యత్వాల నమోదు గురించి పరిశీలిస్తూ ప్రతి ఒక్కరికి సభ్యత్వం వల్ల వచ్చే రెండు లక్షల ఇన్సూరెన్స్ గురించి తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ కాకునూరి నారాయణ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ అధ్యక్షులు వెంపటి శ్రీను, కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల కృష్ణ, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎడవల్లి నరేందర్ రెడ్డి, అనుముల డైరెక్టర్ కుందూరు శ్రీనివాస్ రెడ్డి, తక్కలపెల్లి సైదులు, మైనార్టీ సెల్ అధ్యక్షుడు మజహార్ మోహినుద్దీన్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాండు నాయక్, పాంపాటి శ్రీనివాస్, వర్కల శ్రీనివాస్ రెడ్డి, మస్తాన్ రావు, శివరామయ్య, కుందూరు శ్యాంసుందర్ రెడ్డి, నకిరేకంటి సైదులు మాదిగ, చందు నాయక్, గోవర్ధన్ రెడ్డి, బూర నాయక్,ఆనందు, సాయి, వడాల లక్ష్మయ్య, నరసింహ, బొంగరాల ఏసు రాజు, సాజిద్,యాదగిరి, ప్రశాంత్, పోలే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.




Next Story