- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజకీయ కుట్రలో భాగమే ఐటి దాడులు.. ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి
by Batti.Sumithra |
రాజకీయ కుట్రలో భాగంగానే తన పై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు.

X
దిశ, యాదాద్రి కలెక్టరేట్ : రాజకీయ కుట్రలో భాగంగానే తన పై ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరిగాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం ఐటీ దాడుల తర్వాత తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా తనిఖీలు చేపట్టిన అధికారులు తన కంపెనీలు, వాటి ఆర్థిక లావాదేవీల పై వివరాలు తీసుకున్నారన్నారు.
తొలిరోజు గంటన్నరలోపే ఐటీ దాడులు పూర్తియిన కావాలనే 3 రోజులు ఇబ్బంది పెట్టారన్నారు. వారికి అనునకూలమైన సమాచారం లభించక పోవడంతో ఏమి చేయలేకపోయారని అన్నారు. ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చారని, ఎప్పుడు విచారణకు పిలిచినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని శేఖర్ రెడ్డి తెలిపారు. గత మూడు రోజులుగా అండగా నిలిచిన కార్యకర్తలు, నాయకులు, ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
Next Story






