వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి

by Disha Web Desk 22 |
వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కేటాయించాలి
X

దిశ, తిరుమలగిరి (సాగర్) : మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని మండలంలోని వివిధ పత్రికలలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు గురువారం మండల తహశీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ లక్ష్మి కాంత్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ పత్రికలలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికి ఇంటి స్థలాలు కేటాయిస్తుందని అన్నారు. అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా వివిధ పత్రికల్లో పని చేస్తున్న మండలంలోని వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలన్నారు. అక్రిడిటేషన్ పేరుతో కొంత మందికే ఇంటి స్థలాలు కేటాయించడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో కటికర్ల మల్లయ్య, నల్లబోతు వెంకటేశ్వర్లు, కత్తి ప్రభాకర్ రెడ్డి, మోహన్ కృష్ణ, పాతనబోయిన సురేష్, నంది కిరణ్, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed