గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : గొంగిడి మహేందర్ రెడ్డి

by Disha Web Desk 15 |
గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : గొంగిడి మహేందర్ రెడ్డి
X

దిశ, ఎం తుర్కపల్లి : గిరిజనులు అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని జిల్లా సహకార సంఘం చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వానికి గిరిజనులపై అంతులేని ప్రేమ ఉందని చెప్పడానికి సంతులాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడమే నిదర్శమనిన్నారు. ఈ కార్యక్రమములో ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు బిర్లా అయిల్లయ్య, బీజేపీ నాయకులు పడాల శ్రీనివాస్, జెడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయకు, ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్, మండల పార్టీ అధ్యక్షుడు పిన్నపు రెడ్డి నరేందర్ రెడ్డి,సింగిల్ విండో చైర్మన్ సింగిరెడ్డి నరసింహ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకులు గట్టు తేజస్వి నిఖిల్, సర్పంచులు పోగుల ఆంజనేయులు, సత్యనారాయణ, రామ్ మోహన్ శర్మ, సురేష్, శంకర్ నాయక్, హరి నాయక్, బద్దు నాయక్, తలారి శ్రీనివాస్, వెంకటష్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed