Breaking News : సూర్యాపేటలో తప్పిన ఘోర బస్సు ప్రమాదం.. 50 మంది విద్యార్థులు సురక్షితం

by M.Rajitha |
Breaking News : సూర్యాపేటలో తప్పిన ఘోర బస్సు ప్రమాదం.. 50 మంది విద్యార్థులు సురక్షితం
X

దిశ, వెబ్ డెస్క్ : సూర్యాపేట(Suryapeta) జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) తృటిలో తప్పింది. జిల్లాలోని మునగాల(మం) జగన్నాథపురం వద్ద కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో నడిగుడెం మండలం కరవిరాలకు చెందిన 50 మంది మోడల్ స్కూల్ విద్యార్థులు ఆ బస్సులో ఉన్నారు. తక్షణమే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపి, కండక్టర్ సహాయంతో చాకచక్యంగా విద్యార్థులను కిందికి దింపారు. కాగా తక్షణమే స్పందించిన గ్రామస్తులు గ్రామ పంచాయితీ వాటర్ ట్యాంకర్ సహాయంతో మంటలు ఆర్పివేశారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.



Next Story