దిశ ఎఫెక్ట్ : ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జానే.. కథనానికి స్పందన..

by Bhanu |

చివ్వేంల మండల పరిధిలోని ఉండ్రు గొండ గుట్టలలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది.

దిశ ఎఫెక్ట్ : ప్రభుత్వ భూమి కనిపిస్తే కబ్జానే.. కథనానికి స్పందన..
X

దిశ, చివ్వేంల: చివ్వేంల మండల పరిధిలోని ఉండ్రు గొండ గుట్టలలో వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. గత ప్రభుత్వం ప్రభుత్వ స్థలంలో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కొంతమంది వ్యక్తులు డంపింగ్ యార్డ్ కోసం తీసిన పూడ్చివేయడమే కాకుండా మరుగుదొడ్ల పైన ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు కూడా దొంగలించడం జరిగింది. దిశ పత్రికలో కధనం ప్రచురించడం జరిగింది... స్పందించిన గ్రామపంచాయతీ కార్యదర్శి సోమవారం గుంతకూర్చిన రైతుకు నోటీస్ ఇచ్చి మంగళవారం డంపింగ్ యార్డ్ గూర్చిన గుంటను జెసిబి తో గుంత తీయడం జరిగింది. ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాస్తున్న డంపింగ్ యాడ్ పూడ్చివేసిన గుంటను తీయించడం పట్ల గ్రామపంచాయతీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ దిశ పత్రిక ఇలానే ప్రజల పక్షాన నిలబడి వార్తలు రాయాలని తెలియజేశారు.

Next Story