సూర్యాపేట జిల్లా కొత్త ఎస్పీ ఎవరో తెలుసా..?

by Naveena |
సూర్యాపేట జిల్లా కొత్త ఎస్పీ ఎవరో తెలుసా..?
X

దిశ,సూర్యాపేట : సూర్యాపేట జిల్లా ఎస్పీగా కె.నరసింహను నియమిస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న సన్ ప్రీత్ సింగ్ డీఐజీగా ప్రమోషన్ రావడంతో..వరంగల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బదిలీ అయ్యారు. మహబూబ్ నగర్ ఎస్పీగా, గవర్నర్ ఏజిసిగా పని చేసిన నరసింహ కొంతకాలంగా డీఐజీ కార్యాలయంలో అటాచ్ అయి పోస్టింగ్ కోసం నిరీక్షిస్తూ సూర్యాపేట జిల్లాకు బదిలీ పై రానున్నారు. గ్రూప్ 1కు చెందిన కె.నరసింహ 2020 లో కన్ఫామ్ ఐపీఎస్ గా నియమితులయ్యారు.



Next Story