ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి వార‌ధిగా ప్ర‌తిరూపం 'దిశ'

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2026-01-22 14:52:21  IST  )

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి వార‌ధిగా ప్ర‌తిరూపం దిశ ప‌త్రిక అని నేరేడుగొమ్ము త‌హ‌శీల్దార్ ఉమాదేవి పేర్కొన్నారు.

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి వార‌ధిగా ప్ర‌తిరూపం దిశ
X

దిశ‌, నేరేడుగొమ్ము : ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వానికి వార‌ధిగా ప్ర‌తిరూపం దిశ ప‌త్రిక అని నేరేడుగొమ్ము త‌హ‌శీల్దార్ ఉమాదేవి పేర్కొన్నారు. శుక్ర‌వారం ఎమ్మార్వో కార్యాల‌యంలో ఆమె దేవ‌ర‌కొండ వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ మాజీ చైర్మ‌న్, సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కులు ముక్క‌మ‌ల్ల వెంక‌ట‌య్య గౌడ్ తో క‌లిసి దిశ క్యాలెండ‌ర్ ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ "దిశపత్రిక"ఎప్పటి వార్తలను అప్పుడే అందిస్తూ అనతి కాలంలోనే ప్రజల మన్ననలను చూర‌గొంటుంద‌ని తెలిపారు. అన్నింటికంటే ముందుండే పత్రికగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని కొనియాడారు. ప్రజల సమస్యలను సూటిగా అధికారుల, పాలకుల దృష్టికి తీసుకువెళ్లడంలో తన దైన శైలితో ఎప్ప‌టిక‌ప్పుడు వార్త‌లు అందిస్తుంద‌ని తెలిపారు. ప్రత్యేక ముద్రతో డిజిటల్ రంగంలో ప్రజల పక్షాన నెంబర్ వన్ గా ముందు వరుసలో ఉందని వారు ప్రశంసించారు. ప్రారంభమైన కొద్ది కాలంలోనే పత్రికకు లభించిన ప్రజాదరణ పత్రిక విశ్వసనీయతకు నిదర్శనమని తెలిపారు. ప్రజల గుండెల్లో "దిశపత్రిక" నిలిచిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో సుదర్శన్, RI నిఖిల్, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు పులికంటి సుధాకర్, సర్పంచ్ లు స్వాతి ముత్యం, మంజునాథ్, N బాలు, రవి, నగేష్, భీమ్ సింగ్, శ్రీను, వెంకటేష్, N అలివేలు ఛత్రు, దశ్రు, బాబురామ్, శివ కుమార్, నేరేడుగొమ్ము ఉప స‌ర్పంచ్ ఎలిజ‌ర్ల శ్రీను, పంచాయతీ కార్యదర్శులు బాలరాజ్ ఉపాధిహామీ టెక్నీకల్ అసిస్టెంట్ R ఆంజనేయులు, దిశ‌ రిపోర్టర్ N చెన్నయ్య పాల్గొన్నారు.

Next Story