అమలుకు నోచని డిజిటలైజేషన్.. అటకెక్కిన ఈ పంచాయితీలు

by Ramesh Goud |
అమలుకు నోచని డిజిటలైజేషన్.. అటకెక్కిన ఈ పంచాయితీలు
X

సాంకేతికాభివృద్ధి వినువీధుల్లో విహరిస్తున్న వేళ ప్రభుత్వ కార్యాలయాలు నేటికీ అందిపుచ్చుకోకపోవడం శోచనీయం. డిజిటల్ రంగంలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానంలో ఉంచడమే లక్ష్యమని చెప్పడం తప్పా అమలు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. ప్రస్తుత 5జీ కాలంలోనూ ప్రభుత్వ కార్యాలయాల్లో 1జీ సేవలే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. పాలక వర్గాలు, అధికార యంత్రాంగాలు ఈ-పంచాయతీల ఊసే మరచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం కొందరు అధికారులు, సిబ్బంది సమయపాలన లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫేస్ ఐడీలు, డిజిటల్ థంబ్ ఇంప్రెషన్ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల హాజరులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పలు కార్యాలయాల్లో నేటికీ డిజిటల్ థంబ్, ఫేస్ ఐడీలు లేకపోవడం గమనార్హం‌. దీంతో ఉద్యోగులు తమ ఇష్టానుసారంగా వచ్చి వెళ్తుండడంతో పలు పనుల కోసం వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అత్యంత వేగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా 2015లో అప్పటి ప్రభుత్వం ఈ-పంచాయతీల ప్రతిపాదనను తెర మీదకు తెచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కంప్యూటర్‌తోపాటు ఇంటర్‌నెట్ కనెక్షన్ ద్వారా గ్రామాల్లో ఆన్ లైన్ సేవలు అందించే దిశగా ప్రణాళికలు చేశారు. కానీ నేటికీ పలు జీపీల్లో ఆ ఛాయలు కనిపించడం లేదు.

దిశ, మోతె : రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం కొందరు అధికారులు, సిబ్బంది సమయపాలన లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫేస్ ఐడీలు, డిజిటల్ థంబ్ ఇంప్రెషన్ లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగుల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల్లో నేటికీ డిజిటల్ థంబ్, ఫేస్ ఐడీలు లేకపోవడం గమనార్హం‌. దీంతో ఉద్యోగులు తమ ఇష్టానుసారం వచ్చి వెళ్తుండడంతో తమ పనుల నిమిత్తం ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పాడుతున్నాయి.

పని చేయని సీసీ కేమెరాలు..

ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు కొన్ని చోట్ల మాత్రమే ఉన్నాయి. సబ్ రిజిష్ట్రార్/తహశీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఉండి రిజిస్ట్రేషన్ తదితర పనులను వీడియో రికార్డింగ్ చేయాల్సి ఉన్నప్పటికీ పలు తహశీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు కనిపించడం లేదు. దీంతో పలు అక్రమాలు జరుగుతున్నాయనేది పలువురి వాదన. ఉద్దేశపూర్వకంగానే సీసీ కేమెరాలను పని చేయకుండా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. భూ రిజిస్ట్రేషన్‌కు ఉదయం 11గంటలకు స్లాట్ బుక్ చేసుకుంటే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సాయంత్రం 5గంటలకు రిజిస్ట్రేషన్ పూర్తి అవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటకెక్కిన ఈ-పంచాయతీలు..

అత్యంత వేగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా 2015లో అప్పటి ప్రభుత్వం ఈ-పంచాయతీల ప్రతిపాదన తెర మీదకు తెచ్చింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కంప్యూటర్‌తోపాటు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడమే లక్ష్యం. దీని ద్వారా గ్రామాల్లో ఆన్ లైన్ సేవలు అందించే దిశగా ప్రణాళికలు చేశారు. అయితే నేటికీ పలు జీపీల్లో ఆ ఛాయలు కనిపించడం లేదు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వమైనా ప్రభుత్వ కార్యాలయాల్లో నూతన సాంకేతికతను అమలు చేయాలని పలువురు కోరుతున్నారు.



Next Story

Most Viewed