- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రేవంత్ రెడ్డి జోలికొస్తే ఊరుకునేది లేదు... రవి నాయక్
దిశ, దేవరకొండ: టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అవినీతి పాలను అంత మొందించడానికి చేపట్టి హాథ్ సే హాథ్ జోడోయాత్రను జీర్ణించుకోలేని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా యాత్ర కొనసాగుతుందని టీపీసీసీ మెంబర్ ఉస్మానియా ఉద్యమ నేత డాక్టర్ రవి నాయక్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మంగళవారం భూపాలపల్లిలో నిర్వహిస్తున్న హాథ్ సే హాథ్ జోడో యాత్రకు విశేష స్పందన రావడంతో జీర్ణించుకోలేని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రాం రెడ్డి తన అనుచరులచే రేవంత్ రెడ్డిపై కోడిగుడ్లను విసిరించారంటూ ఆరోపించారు. రాష్ట్రంలో కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్ మెప్పు పొందడానికే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డిపాజిట్లు కూడా రావని ఆయన అన్నారు. ఇకపై రేవంత్ రెడ్డిపై ఎలాంటి దాడులు జరిగినా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి యువత ఉవ్వెత్తున లేచి, వారి భరతం పడతామని ఆయన హెచ్చరించారు.