సీఎం కేసీఆర్ ఎఫ్టెక్ట్ : యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

by Disha Web Desk |
సీఎం కేసీఆర్ ఎఫ్టెక్ట్ : యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, మిర్యాలగూడ: సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో యాదాద్రి థర్మల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ ప్లాంట్ పనులు పరిశీలించడానికి సీఎం కేసీఆర్ వచ్చారు. దీంతో థర్మల్ కేంద్రం ఏర్పాటులో తమ భూములు కోల్పోయాయని రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఇంత వరకు జాబ్ కార్డులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూములు తీసుకునే సమయంలో జాబ్‌లు ఇస్తారని అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. మరోవైపు మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు చేయాలని జిల్లా సాధన సమితి సభ్యులు ప్ల కార్డులు ప్రదర్శించారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత ఏర్పడగా పోలీసులు చెదరగొట్టి ఆందోళనకారులను అరెస్ట్ చేశారు.

Read More: మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు గొప్పలు చెప్పుకోదగ్గ విజయం కాదు : రోజగోపాల్ రెడ్డి




Next Story

Most Viewed