Breaking: సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు.. ఎన్ని కోట్లు మంజూరు చేస్తున్నారంటే..!

by Disha Web Desk 16 |
Breaking: సూర్యాపేట జిల్లాకు సీఎం కేసీఆర్ వరాల జల్లు.. ఎన్ని కోట్లు మంజూరు చేస్తున్నారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్: సూర్యాపేట జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 10 లక్షలు ప్రకటించారు సీఎం కేసీఆర్. సూర్యాపేటలో కలెక్టరేట్ భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సూర్యాపేట నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు. సూర్యాపేట మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు, మిగిలిన మున్సిపాలిటీలకు రూ. 25 కోట్లు మంజూరు చేస్తామన్నారు. కవులు, కళాకారులు, సాంస్కృతిక వారసత్వం ఉన్న గడ్డ సూర్యాపేట అని చెప్పారు. అందువల్ల సూర్యాపేటలో రూ. 25 కోట్లతో కళాభారతిని మంజూరు చేశారు. సూర్యాపేట నాలుగు మూలలు తిరిగి చూశానని.. అద్భుతమైన అభివృద్ది జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. మహిళా పాలిటెక్నికల్ కాలేజీకి బిల్డింగ్ మంజూరు చేస్తామన్నారు. స్పోర్ట్స్ స్టేడియంతో పాటు స్కూలుకు వెంటనే జీవో విడుదల చేస్తామని తెలిపారు. అలాగే ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌ను కూడా మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed