సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.. : మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

by Disha Web Desk 22 |
సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా.. : మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
X

దిశ, చౌటుప్పల్ టౌన్: సీఎం కేసీఆర్‌కు తాను జీవితాంతం రుణపడి ఉంటానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత గురువారం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని శ్రీ ఆందోల్ మైసమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ తనపై నమ్మకంతో మరోసారి మునుగోడు అభ్యర్థిగా ప్రకటించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మునుగోడు అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గిరికటి నిరంజన్ గౌడ్, చింతల దామోదర్ రెడ్డి, ముత్యాల ప్రభాకర్ రెడ్డి, మహమ్మద్ బాబాషరీఫ్, ఊడుగు శ్రీనివాస్ గౌడ్, పస్తం గంగరాములు, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Next Story