జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి గాయాలు

by Bhanu |

వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన 8 మందికి గాయాలు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ కు చెందిన చేగూరి రామస్వామి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి యాదగిరిగుట్ట వెళ్లి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు బీబీనగర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారి రంగపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కుతుండగా కారు అదుపుతప్పి ఫ్లైఓవర్ నుంచి కింద పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న 8 మంది నలుగురు పెద్దలు, నాలుగురు చిన్న పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు.



Next Story