- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గుట్టలో బీఆర్ఎస్ మండల స్థాయి సన్నాహక సమావేశం

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: ఈ నెల 27న వరంగల్ లోని ఎల్కతుర్తిలో జరిగే బీఅర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసేందుకు ప్రత్యేక సన్నాహక సమావేశాన్ని రేపు యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో నిర్వహిస్తున్నట్లు బీఅర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య వెల్లడించారు. బుధవారం యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్యగౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి క్యామ మల్లేశ్ పాల్గొని పలు సలహాలు, సూచనలు చేస్తారని తెలిపారు.
ఈ సమావేశానికి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన మాజీ జడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ మండలశాఖ నాయకులు, గ్రామశాఖ నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన, సోషల్ మీడియా ప్రతినిధులు, పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్లు, పట్టణ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇమ్మడి రామిరెడ్డి, పట్టణ సెక్రటరి జనరల్ పాపట్ల నరహరి, మండల సెక్రటరి జనరల్ కసావు శ్రీనివాస్, జిల్లా నాయకులు మిట్ట వెంకటయ్య, గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్, శిఖ శ్రీనివాస్, బీసీ విభాగం మండలాధ్యక్షుడు కవిడే మహేందర్, బీఅర్ఎస్ పట్టణ నాయకులు అరే శ్రీదర్, నర్సింగ పురుషోత్తం, శారాజీ రాజేశ్, తుమ్మల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.