మృతుని కుటుంబానికి అండగా బోట్ల సుశీల ఎల్లయ్య ఫౌండేషన్

by Jakkula.Mamatha |

మోటకొండూరు మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బింగి శ్రీహరి కుటుంబానికి బోట్ల సుశీల ఎల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొట్ల శ్రీనివాస్, ఉమామహేశ్వరి దంపతులు తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి బియ్యం పంపిణీ చేశారు.

మృతుని కుటుంబానికి అండగా బోట్ల సుశీల ఎల్లయ్య ఫౌండేషన్
X

దిశ, ఆలేరు: మోటకొండూరు మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన బింగి శ్రీహరి కుటుంబానికి బోట్ల సుశీల ఎల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో 25 కిలోల బియ్యాన్ని ఫౌండేషన్ వ్యవస్థాపకులు బొట్ల శ్రీనివాస్, ఉమామహేశ్వరి దంపతులు తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి శుక్రవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా అవసరమైన వారికి తమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం రమేష్, వంగాల స్వామి, బొట్ల మల్లేష్, కొంపల్లి నరసింహ, వంగపల్లి చిరంజీవి, కొల్లూరి నర్సింగరావు, వంగపల్లి నరేష్, బింగి నాగరాజు తదితరులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Next Story