బీజేపీ సంకల్ప యాత్ర రాజకీయ యాత్ర కాదు

by Disha Web Desk 22 |
బీజేపీ సంకల్ప యాత్ర రాజకీయ యాత్ర కాదు
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్: బీజేపీ విజయ సంకల్ప యాత్ర రాజకీయ యాత్ర కాదని దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు యాత్ర అని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ సారి తెలంగాణ లో 10 సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ అధిష్టానం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం నడవాలంటే మోడీ అండదండలు ఉంటేనే సాధ్యమన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో భువనగిరి ఖిల్లా అభివృద్ధి, ,రాయగిరి వరకు ఎంఎంటీఎస్ పనులు ఆగిపోయాయని గుర్తు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కావాలంటే బీజేపీ ఎంపీలను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు. బంగారు తెలంగాణ కావాలన్నా, బంగారు భువనగిరి కావాలన్న భువనగిరిలో బీజేపీ ఎంపీ గెలవాలని కోరారు. ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలో రైతులు ఎవరు లేరని అన్నారు. రాబోయే ఎన్నికల్లో 400 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, కాసం వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed