పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.25వేల నగదు, ఎర్టిగా కారు స్వాధీనం..

by Disha Web Desk 20 |
పేకాటరాయుళ్ల అరెస్ట్.. రూ.25వేల నగదు, ఎర్టిగా కారు స్వాధీనం..
X

దిశ, నల్లగొండ బ్యూరో : పేకాట ఆడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసిన ఘటన మంగళవారం రాత్రి చిట్యాల పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్యాలకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి మంగళవారం రాత్రి తన వ్యవసాయ క్షేత్రం దగ్గర పేకాట ఆడుతున్నారు. కాగా టాస్క్ ఫోర్స్ అధికారులు నిఘా వేసి పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నారు. వీరితో పాటు 25,000 రూపాయల నగదు, ఒక ఎర్టిగా కారును స్వాధీనం చేసుకుని కేసునమోదు చేసినట్లు చిట్యాల ఎస్సై రవి తెలిపారు.



Next Story