చేనేత కార్మికుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం

by Ratna Kumari |

తెలంగాణ ప్ర‌భుత్వం ఆగ‌స్టు 07, 2026న చేనేత దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో చేనేత కార్మికులకు అవార్డులు ఇవ్వ‌నుంది.

చేనేత కార్మికుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానం
X

దిశ‌, న‌ల్గొండ టౌన్ : తెలంగాణ ప్ర‌భుత్వం ఆగ‌స్టు 07, 2026న చేనేత దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో చేనేత కార్మికులకు అవార్డులు ఇవ్వ‌నుంది. ఇందుకు అర్హత గల కార్మికులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు చేనేత శాఖ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ ఎస్.ద్వార‌క్ శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తిలో డిజైన్ వృత్తి లో పనిచేస్తున్న వారికి ఈ అవార్డులు ఇస్తున్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి రూ.25 వేలు నగదు పురస్కారంతోపాటు ప్రశంస చిత్రం జ్ఞాపక బహూకరించినట్లు తెలిపారు. చేనేత కార్మికుల విభాగంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉన్నవారు 31.12.2025 నాటికీ 30 ఏళ్లు నిండిన.. డిజైనింగ్ విభాగంలో 31.12.2025 నాటికి 25 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన‌ వారు అర్హులని తెలిపారు.

Next Story