- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గ్రూప్స్ లో సత్తా చాటిన వ్యవసాయ అధికారిణి

దిశ,సంస్థాన్ నారాయణపురం : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్స్ ఫలితాలలో నారాయణపురం మండల వ్యవసాయ అధికారిణి కే.వర్షిత తన సత్తాను చాటారు. సంస్థాన్ నారాయణపురం మండల వ్యవసాయ అధికారిణిగా కే వర్షిత గత 4 నెలల క్రితం బాధ్యతలు చేపట్టారు. వ్యవసాయ అధికారిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు. ఇటీవలే ప్రకటించిన గ్రూప్-4 లో రాష్ట్ర స్థాయిలో 143వ ర్యాంకు సాధించి ..వికారాబాద్ జిల్లాలోని మొదటి స్థానంలో నిలిచారు. అదేవిధంగా గ్రూప్-2 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 215 ర్యాంకును సాధించి తన ప్రతిభను చాటారు.
అయితే టీజీపీఎస్సీ విడుదల చేసిన జనరల్ ర్యాంకింగ్స్ లో రాష్ట్రంలో 100వ ర్యాంకును సాధించగా, మల్టీజోన్-II లో 40 వ ర్యాంకును సాధించారు. పరీక్షలు రాసిన మొదటి ప్రయత్నంలోనే అన్ని పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించడం పట్ల ఆమె కుటుంబ సభ్యులు, సహచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండలంలో విధుల్లో చేరిన కొద్ది రోజుల్లోనే ఉన్నత ఉద్యోగాలకు అర్హత సాధించడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో సివిల్స్ రాసి ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని నారాయణపురం మండల వ్యవసాయ అధికారిణి కే,వర్షిత దిశ తో తెలిపారు.