ఎన్నికల ఏర్పాట్లలో అలసత్వం వద్దు: అడిషనల్ కలెక్టర్

by Bhanu |

మొదటి విడత ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు అలసత్వం వహించకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎన్నికల ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఎన్నికల ఏర్పాట్లలో అలసత్వం వద్దు: అడిషనల్ కలెక్టర్
X

దిశ, అర్వపల్లి (జాజిరెడ్డిగూడెం): మొదటి విడత ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు అలసత్వం వహించకుండా, త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ సీతారామారావు ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం ఎన్నికల ఏర్పాట్లను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం తిమ్మాపురం జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మండల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ఝాన్సీ, ఎంపీవో గోపి, ఎస్ఐ సైదులు, ఎన్నికల సిబ్బంది నాగరాజు, వెంకన్న, నర్సింహారాజు తదితరులు పాల్గొన్నారు.

Next Story