ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..

by Kodari Anjali |

హుజూర్ నగర్ పట్టణంలోని ప్రియదర్శిని జూనియర్ కళాశాలలో 2005-2007లో బైపీసీ గ్రూప్ చదివిన పూర్వ విద్యార్థులు ఇవాళ కలిసి సరదాగా గడిపారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం..
X

దిశ, హుజూర్ నగర్ టౌన్: హుజూర్ నగర్ పట్టణంలోని ప్రియదర్శిని జూనియర్ కళాశాలలో 2005-2007లో బైపీసీ గ్రూప్ చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఎంతో ఆహ్లాదకరంగా, ఉత్తేజితంగా ఆదివారం కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు నాడు పాఠాలు బోధించిన అధ్యాపకులను శాలువాలు మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారితో ఆడుతూ, పాడుతూ ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ పశ్య శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ చింతలపూడి విద్యాకర్, జి వెంకటేశ్వర్లు, హైమావతి ఇమామ్ హసన్, రాగం గురవయ్య మాసంపల్లి సైదులు, వేణువర్ధన్ జక్కుల లక్ష్మణ్, ఎల్లావుల సైద య్య, జక్కుల నాగేశ్వరరావు, రవీందర్, పూర్వ విద్యార్థులు, స్వా తి శరత్ చంద్ర ప్రసాద్, దేవరకొండ శ్రీకాంత్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story