- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి రైతు నిరసన
దిశ, వేములపల్లి (మాడుగులపల్లి): పక్కనున్న రైతు ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేసిన సంఘటన మాడుగుల పల్లి మండలంలోని కనేకల్ గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంట పంగ యాదయ్యకు గ్రామ శివారులోని 242 సర్వే నెంబర్ లో వ్యవసాయ భూమి ఉంది. అయితే తన పొలం పక్కనే భూమి గల రైతు బాట కావాలంటూ రైతు యాదయ్యను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. యాదయ్య బాట ఇచ్చేదిలేదని తేల్చి చెప్పడంతో అతడిపై కక్షసాధింపుకు దిగాడు. ప్రజా ప్రతినిధులతో ఫోన్లు చేయించి బెదిరిస్తున్నాడని గ్రామస్థులు తెలిపారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సదరు రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. గ్రామస్తులు సర్ది చెప్పడంతో సెల్ టవర్ పై నుంచి దిగాడు. పోలీసులు కల్పించుకొని తనకు న్యాయం చేయాలని సదరు రైతు డిమాండ్ చేస్తున్నాడు.