Telangana News : ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాల మ్యూజిక్ కన్సర్ట్

by Muthe.Rajitha |

ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​తీరాన ఘనంగా జరుగుతున్నాయి.

Telangana News : ఘనంగా ప్రజాపాలన విజయోత్సవాల మ్యూజిక్ కన్సర్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రజాపాలన విజయోత్సవాలు హైదరాబాద్​లోని హుస్సేన్​సాగర్​తీరాన ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ ఎయిర్​షో(Air Show) ఘనంగా జరిగింది. భారత వాయుసేనకు చెందిన తొమ్మిది సూర్యకిరణ్(Surya Kiran)​విమానాలు అద్భుతమైన విన్యాసాలు చేశాయి. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన ఎయిర్​ షోను సీఎం రేవంత్​రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు, పలువురు ప్రముఖులు హాజరయ్యి వీక్షించారు. రాహుల్​సిప్లిగంజ్​ మ్యూజికల్​కన్సర్ట్(Rahul Sipligunj Musical Concert)​జరుగుతోంది. నెక్లెస్​ రోడ్డులో ఫుడ్, హస్తకళల స్టాళ్లు రేపటి వరకు కొనసాగుతాయి. బిర్యానీ, చాట్, ఐస్​క్రీం, తెలంగాణ, ఉత్తరాది ఫుడ్​స్టాళ్లు ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటు చేసింది. రాజీవ్​గాంధీ విగ్రహం, ఎన్టీఆర్​స్టేడియం, ఫుడ్​ఓవర్​బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన వేదికల వద్ద నేడు, రేపు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. సోమవారం(డిసెంబర్ 09న) సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్​రెడ్డి ఆవిష్కరించనున్నారు. సుమారు లక్ష మంది మహిళలు హాజరయ్యేలా ప్రభుత్వం వసతులు ఏర్పాట్లు పూర్తి చేసింది.

Next Story