'RTC కార్మికులకు ఆఫర్ కంటిన్యూ.. హామీ ఇచ్చిన కేసీఆర్'

by Disha Web Desk 2 |
RTC కార్మికులకు ఆఫర్ కంటిన్యూ.. హామీ ఇచ్చిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ కార్మికులకు మునుగోడు ఉప ఎన్నిక ఆఫర్లు కంటిన్యూ అవుతున్నాయి. ఎలాగైనా ఆర్టీసీ కార్మికుల ఓట్లను తమవైపు తిప్పుకునేందుకు ఏండ్ల నుంచి ఉన్న డిమాండ్‌‌పై ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఈ మేరకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసినట్లు గోవర్ధన్​ తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి పీఆర్సీ ఇచ్చేందుకు సీఎం ఆమోదం చెప్పారని తెలిపారు. త్వరలోనే పే స్కేల్ సవరణ చేస్తామన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్ నుంచి ఎన్నికల ప్రధానాధికారికి లేఖ రాశామని, పీఆర్సీ పర్మిషన్ కోసం విజ్ఞప్తి చేశామని ఈ సందర్భంగా చెప్పారు. ఎన్నికల ప్రధానాధికారి నిర్ణయం అనంతరం పీఆర్సీ అమలు చేస్తామని బాజిరెడ్డి గోవర్ధన్ ప్రకటించారు. ఇప్పటికే డీఏలు, పండుగ అడ్వాన్సులపై నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్టీసీ కార్మికులకు 2017 నుంచి పీఆర్సీ పెండింగ్​ లో ఉందని, దానిపై సీఎం కేసీఆర్​ కు వివరించామన్నారు. సంస్థ ఉద్యోగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటామని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్​ అన్నారు.



Next Story

Most Viewed