సీఎం కేసీఆర్‌కు ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి లేఖ

by Disha Web Desk 2 |
సీఎం కేసీఆర్‌కు ఎంపీ ఉత్తమ్​కుమార్​రెడ్డి లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూనియర్​ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్​చేయాలని సీఎం కేసీఆర్‌కు నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్​రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలో గత 13 రోజుల నుంచి పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నా.. పట్టించుకోకపోవడం దారుణమన్నారు. సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటి పోయిందన్నారు. 2018 నూతన పంచాయితీరాజ్ చట్టం మేరకు గ్రామాల అభివృద్ధి కోసం మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్‌తో 2019 ఏప్రిల్ 12న 9,355 మంది పంచాయితీ కార్యదర్శులుగా నియమించారని, కానీ నాలుగేళ్లు గడిచినా రెగ్యులర్ చేయకపోవడం సరికాదన్నారు. జేపీఎస్‌లవి న్యాయపరమైన డిమాండ్లేనని, తక్షణమే సీఎం హోదాలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. గ్రామపంచాయతీ పరిధిలో 56 రకాల విధులు, 42కు పైగా రికార్డుల బాధ్యతలు నిర్వర్తిస్తూ 12 గంటల పాటు పనిభారంతో సతమతమవుతున్నారన్నారు.

ఇప్పటికే చాలామంది తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఒత్తిడికి తట్టుకోలేక సుమారు 1500 ఉద్యోగాలు వదిలేశారన్నారు. అనారోగ్య సమస్యలతో 44 మంది మృతి చెందినట్లు గుర్తుచేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. ఇప్పటికైనా పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాల్సిన బాధ్యత ఉన్నదని నొక్కి చెప్పారు. చనిపోయిన పంచాయితీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. ఔట్​సోర్సింగ్ సెక్రటరీలను కూడా రెగ్యులర్​చేయాలన్నారు. దీంతో పాటు మహిళా పంచాయితీ కార్యదర్శులకు 6 నెలల ప్రసూతి సెలవులతో పాటు 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని ఉత్తమ్​డిమాండ్​చేశారు. లేదంటే ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రత్యేక కార్యచరణను రూపొందించాలని హెచ్చరించారు.


Next Story

Most Viewed