మునుగోడులో కాంగ్రెస్‌ గెలుపు కోసం అందరం పనిచేస్తాం: ఉత్తమ్

by Disha Web Desk 2 |
మునుగోడులో కాంగ్రెస్‌ గెలుపు కోసం అందరం పనిచేస్తాం: ఉత్తమ్
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిపై ప్రతిపాదనలు ఏఐసీసీకి పంపించామని మాజీ పీసీసీ ప్రెసిడెంట్, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ గెలుపు కోసం నాయకులు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తామని అన్నారు. త్వరలోనే ఏఐసీసీ కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేస్తుందని తెలిపారు. అంతేగాక, గాంధీ కుటుంబంపై ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను తెలంగాణ అసెంబ్లీ నుంచి కూడా బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed