ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం కేసు.. వెలుగులోకి కీలక విషయాలు..!

by Disha Web Desk 4 |
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం కేసు.. వెలుగులోకి కీలక విషయాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ మెదక్ ఎంపీ, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి హత్యాయత్నం కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఎంపీపై హత్యాయత్నానికి ప్రయత్నించిన రాజు స్వగ్రామం మిరుదొడ్డి మండలం చెప్యాలగా పోలీసులు గుర్తించారు. రాజు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. రెండు ఫేస్ బుక్ అకౌంట్లను నిందుతుడు వాడుతున్నాడు. ఫేస్ బుక్‌లో పలువురు రాజకీయ నేతలతో దిగిన ఫోటోలను రాజు అప్ లోడ్ చేశాడు.

ప్రస్తుతం ఓ యూట్యూబ్ చానల్‌లో రాజు పనిచేస్తున్నాడు. ఇక, 38 ఏళ్ల రాజుపై హత్యాయత్నం చేసిన నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు సిద్ధిపేట పోలీసు కమీషనర్ ఎన్ శ్వేత తెలిపారు. ఈ దాడికి సంబంధించి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. కాగా బీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో రాజు సైతం తీవ్రంగా గాయపడటంతో మెరుగైన చికిత్స కోసం నిందితుడిని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు.

Next Story

Most Viewed