రేవంత్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.. సీఎంపై MP ధర్మపురి అర్వింద్ ఫైర్

by Disha Web Desk 19 |
రేవంత్ చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు.. సీఎంపై MP ధర్మపురి అర్వింద్ ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను తొలగించాలని చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు అని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక.. వాటి నుండి ప్రజల దృష్టి మర్చలేందుకు కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. అసలు ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు తీసేసింది కాంగ్రెస్ పార్టీనేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మోసగాళ్ల పార్టీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఏఏ, ఎన్ఆర్సీ, యూనిఫామ్ సివిల్ కోడ్‌పై కాంగ్రెస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అర్వింద్ డిమాండ్ చేశారు.

Read More...

BREAKING: ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతాం: ప్రతిపక్షాలకు సీఎం రేవంత్‌రెడ్డి సవాల్

Next Story

Most Viewed