YS Avinash Reddy: నాలుగు రోజులు సమయం ఇవ్వండి.. విచారణరకు హాజరవుతా

by Disha Web Desk 16 |
YS Avinash Reddy: నాలుగు రోజులు సమయం ఇవ్వండి.. విచారణరకు హాజరవుతా
X

దిశ, వెబ్ డెస్క్: వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ అధికారులకు కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి లేఖ రాశారు. వివేకా హత్య కేసులో విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. విచారణకు షార్ట్ నోటీసు ఇచ్చినందు వల్ల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కనీసం నాలుగు రోజులు గడువు కావాలని కోరారు. ముందుగా కార్యక్రమాలు ఉండటంతో ఈ రోజు విచారణకు హాజరుకాలేనని పేర్కొన్నారు. అయితే అవినాశ్ రెడ్డి విజ్ఞప్తిపై సీబీఐ అధికారులు స్పందించలేదు. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి పులివెందులకు బయల్దేరి వెళ్లారు.

Read More: `బండి´ మొబైల్ ఫోన్ ఎక్కడ?.. నెల దాటినా దర్యాప్తులో లేని పురోగతి

తెలంగాణలో మూడు రోజుల పాటు దంచికొట్టనున్న ఎండలు



Next Story

Most Viewed