Motkupalli: ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకివ్వడం లేదో అర్థం కావడం లేదు: మోత్కుపల్లి

by Prasad Jukanti |

ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డుపై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Motkupalli: ఎన్టీఆర్ కు భారత రత్న ఎందుకివ్వడం లేదో అర్థం కావడం లేదు: మోత్కుపల్లి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం రాజకీయాలు భ్రష్టుపట్టాయని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసహింపులు (Motkupalli Narasimhulu) సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి తారకరామారావుకు భారతరత్న(Bharatratna) ఎందుకు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఇవాళ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోత్కుపల్లి.. కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ కు (NTR) భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్డీఆర్ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. ఎన్టీఆర్ బిక్షతో నాలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉన్నారని, నేను ఏ పార్టీలో ఉన్నా తన స్ఫూర్తితో వచ్చి పోతుంటానన్నారు. కోట్లు ఉన్నవాడితే రాజకీయం అవుతోంది. ఒక్క రూపాయి లేకపోయినా నేను ఎమ్మెల్యేను ఆయ్యానంటే అది ఎన్టీఆర్ వల్లేనన్నారు.

Next Story