రామ మందిరాన్ని ఆయుధంగా వాడుకుంటున్న మోడీ : మాజీ ఎంపీ హనుమంతరావు

by Disha Web Desk 1 |
రామ మందిరాన్ని ఆయుధంగా వాడుకుంటున్న మోడీ : మాజీ ఎంపీ హనుమంతరావు
X

దిశ, వెబ్‌డెస్క్ : రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ శ్రీరాముడిని ఆయుధంగా వాడుకుంటున్నాడని మాజీ ఎంపీ హనుమంతరావు ఆరోపించారు. ఇవాళ ఆయన గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో రెండో సారి మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చి హామీలను తుంగలో తొక్కారని మండిపడ్డారు. మణిపూర్‌లో అంత పెద్ద ఎత్తున హింసాకాండ జరుగినా.. బాధ్యతయుత పదవిలో ఉండి ఆ విషయంపై కనీసం స్పందించలేదని ధ్వజమెత్తారు. నరేంద్ర మోడీ రాముడట.. రాహుల్ గాంధీ రావణుడట.. ఇదేక్కడి అన్యాయం అని అన్నారు. రాముడు కొందరివాడు కాదని.. అందరివాడని అన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని హనుమంతరావు స్పష్టం చేశారు.

Next Story

Most Viewed