- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత రిక్వెస్ట్

దిశ, వెబ్ డెస్క్: మిస్ వరల్డ్ పోటీలను (Miss World pageants) వాయిదా వేయాలని తెలంగాన ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్(Twitter) ట్వీట్ చేశారు. అందులో "భారతదేశం, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా 72వ మిస్ వరల్డ్ ఈవెంట్ను వాయిదా వేయడాన్ని పరిగణించాలని నేను తెలంగాణ ప్రభుత్వాన్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈ సమయంలో, మన దృష్టి జాతీయ ఐక్యత, శాంతి, భద్రతపై ఉండాలి." అని రాసుకొచ్చారు. కాగా నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి.
కాగా ఈ పోటీలకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని మిస్ వరల్డ్ పోటీలు వాయిదా వేయాలని కొరడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే తెలంగాణలోని ప్రముఖులు సైతం ఈ మిస్ వరల్డ్ పోటీలను వాయిదా వేయాలని.. జరగకూడని సంఘటనలు జరిగితే ప్రపంచం ముందు తెలంగాణతో పాటు పాక్ పరువు పోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా భారత్, పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద టోర్నమెంట్ ఆయిన ఐపీఎల్ను బీసీసీఐ వారం రోజుల పాటు సస్పెండ్ చేసింది.