‘‘ఢిల్లీ.. వయా బెంగళూరు’’.. రేవంత్ రెడ్డి, డీకే భేటీపై కవిత సెటైర్స్

by Disha Web Desk 19 |
‘‘ఢిల్లీ.. వయా బెంగళూరు’’.. రేవంత్ రెడ్డి, డీకే భేటీపై కవిత సెటైర్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటకలో కాంగ్రెస్‌ను పవర్‌లోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేసిన డీకే శివకుమార్‌ను శుక్రవారం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కలిశారు. అతి త్వరలో తెలంగాణలో జరగబోయే ఎన్నికల గురించి, ఎన్నికల వ్యూహాల గురించి ఇద్దరు పీసీసీ చీఫ్‌లు చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా ఇవాళ ఎమ్మెల్సీ కవిత వారి భేటీపై సెటైర్లు వేశారు. ‘అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు ఢిల్లీ.. కానీ ఇప్పుడు వయా బెంగళూరు, కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం, ఢిల్లీ గల్లీలలో మోకరిల్లడం’ అంటూ ట్వీట్ చేశారు.


Next Story

Most Viewed