'మోడీ, కేసీఆర్‌ల ఫొటోలు తీసి.. ఆ ఫొటో పెట్టండి'

by Disha Web Desk 2 |
మోడీ, కేసీఆర్‌ల ఫొటోలు తీసి.. ఆ ఫొటో పెట్టండి
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫోటోల పంచాయతీ తప్ప అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేషన్ షాపుల్లో నేతల బొమ్మలు కాదని జీఎస్టీ బొమ్మలు పెట్టాలని ఫైర్ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను అప్పుల ఊబిలో పడేసేందుకు పోటీ పడుతున్నాయని మండిపడ్డారు. ఈ ఎనిమిదేళ్లలో ప్రజలపై జీఎస్టీ ద్వారా రూ.3 లక్షల కోట్ల భారం పడిందని అన్నారు. జీఎస్టీ వల్ల ప్రజలకు పన్నుల భారం తప్పితే మరో ప్రయోజనం లేదన్నారు. రైతుబంధు సాకుతో రాష్ట్ర ప్రభుత్వం మిగతా ప్రయోజనాలను నిలిపివేసిందని విమర్శించారు. 2014కు ముందు అమలైన పథకాలు ఇప్పుడు ఆపేశారని దుయ్యబట్టారు. వాటిలో కొన్ని పథకాల పేర్లు మార్చి గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.



Next Story

Most Viewed