రేవంత్ జేబు సంస్థగా ఎన్నికల సంఘం: దాసోజు

by Gantepaka Srikanth |

రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల సంఘం రేవంత్ జేబు సంస్థగా మారిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు.

రేవంత్ జేబు సంస్థగా ఎన్నికల సంఘం: దాసోజు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగ బద్ధమైన ఎన్నికల సంఘం రేవంత్ జేబు సంస్థగా మారిపోయిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల షెడ్యూల్‌ను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. రూ.కోట్లు ఖర్చు చేసి రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారని అన్నారు. బీసీలను నయవంచన చేశారని పేర్కొన్నారు. వచ్చే నెల 12న తుది తీర్పు రానున్నదని.. ఆ తీర్పులో ప్రభుత్వం వాదనను ఒప్పుకుంటే బీసీలకు రిజర్వేషన్లు వస్తాయని చెప్పారు. హైకోర్టులోనూ కేసు పెండింగ్‌లో ఉన్నదని.. ఇలాంటి సమయంలో హైకోర్టులో పెండింగ్‌లో కేసు ఉండగా ఆగమేఘాల మీద షెడ్యూల్ ఎందుకని ప్రశ్నించారు.

Next Story