- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ను కలిసిన MLC అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి?
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నల్గొండ - వరంగల్ - ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలుపొందిన PRTU అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి(Pingili Sripal Reddy) కేసీఆర్ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దిశ, వెబ్డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నల్గొండ - వరంగల్ - ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలుపొందిన PRTU అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి(Pingili Sripal Reddy) కేసీఆర్ను కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బుధవారం ఎర్రవల్లి నివాసం(Erravalli Residence)లో కేసీఆర్(KCR)ను కలిసినట్లు సమాచారం. ఎన్నికలు జరిగిన తీరు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. నల్గొండ - వరంగల్ - ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానంలో పీఆర్టీయూ తెలంగాణ అభ్యర్థి పింగిళి శ్రీపాల్రెడ్డి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మూడు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మెుత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా.. మెుదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో 13969 ఓట్లతో శ్రీపాల్ రెడ్డి గెలుపొందారు.
కేసీఆర్ను కలిసిన నల్గొండ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2025
నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన PRTU అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ను కలిశారు https://t.co/aSM24cWyXL pic.twitter.com/VDHddrCJsi






