MLA సాయన్న మృతి పేద వర్గాలకు తీరని లోటు: కాసాని జ్ఞానేశ్వర్

by Disha Web Desk 19 |
MLA సాయన్న మృతి పేద వర్గాలకు తీరని లోటు: కాసాని జ్ఞానేశ్వర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అకాల మృతికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ సంతాపం ప్రకటించారు. ఆదివారం సాయన్న మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనోధైర్యం ఇవ్వాలని దేవుడిని ప్రార్ధించారు. ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ.. పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న గొప్ప నేత సాయన్న అన్నారు. టీడీపీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన సాయన్న.. 5 సార్లు కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు.

వివాద రహితుడిగా పేరున్న ఆయన నిరంతరం బడుగువర్గాల సంక్షేమం, కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారని కొనియాడారు. హుడా డైరెక్టర్గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా, వీధి బాలలకు పునరావాసంపై హౌస్ కమిటీ చైర్మన్‌గా కూడా సాయన్న సుదీర్ఘ కాలంగా విశేష సేవలందించారని పేర్కొన్నారు. సాయన్న మరణం పేద బడుగు వర్గాలకు తీరని లోటని అన్నారు. తెలంగాణ టీడీపీ సమన్వయకర్త కంభంపాటి రాం మోహన్ రావు మాట్లాడుతూ సాయన్న లేని లోటు పూడ్చలేనిదన్నారు.

Next Story

Most Viewed