'ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేయాలి'

by Disha Web Desk 4 |
ఎమ్మెల్యే రసమయి రాజీనామా చేయాలి
X

దిశ, గన్నేరువరం: పంటలు ఎండుతున్నప్పటికీ రైతుల గోస పట్టించుకోని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు నగునూరి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలోని మాదాపూర్ హనుమాజి పల్లి గ్రామాల మధ్యన అసంపూర్తిగా వదిలివేసిన డి -9, 1 ఎల్ ఉపకాల్వ వద్ద మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి టెంట్ వేసి నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేవలం 150 మీటర్ల మేర కాలువ పనులు పూర్తి చేస్తే 600 ఎకరాలలో పంటలకు నీరు అందుతుందని, హనుమాజీ పల్లెలో రెండు చెరువులు జలకల సంతరించుకుని మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందన్నారు. రైతులు మాట్లాడుతూ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసామని సాగునీరు అందక, 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఇవ్వకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు.

మాకు ఇప్పుడు ఈ కాలువే దిక్కని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మానకొండూర్ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకులు రాజిరెడ్డి, మండల నాయకులు బండి తిరుపతి అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed