అసెంబ్లీకి బుల్లెట్ బైక్‌తో వచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్.. ఒక్కసారిగా పోలీసులు షాక్.. (వీడియో)

by Mahesh |
అసెంబ్లీకి బుల్లెట్ బైక్‌తో వచ్చిన ఎమ్మెల్యే రాజా సింగ్.. ఒక్కసారిగా పోలీసులు షాక్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. బుల్లెట్ బండి పై అసెంబ్లీకి వచ్చి అందరిని షాక్‌కి గురి చేశారు. హైదరాబాద్ లో అత్యంత ఎక్కువ ప్రాణహాని ఉన్న ఎమ్మెల్యేలలో రాజా సింగ్ ఒకరు. కాగా అతనికి రాష్ట్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ప్రోవైడ్ చేసింది. కాగా కొద్ది రోజులుగా ఆయన బుల్లెట్ వాహనం సాంకేతిక సమస్యలతో పలుసార్లు రోడ్డుపైనే ఆగిపోయింది. దీంతో తనకు మరో వాహనం ఇవ్వమని ప్రభుత్వానికి ఎన్ని సార్లు లేఖ రాసినప్పటికీ పాత దానినే రిపేర్ చేసి ఇచ్చారని రాజా సింగ్ ఆరోపించారు.

కాగా రెండు రోజుల క్రితం బుల్లెట్ ప్రూఫ్ కారు.. ముందు టైర్ సడెన్‌గా ఉడిపోవడంతో రాజాసింగ్‌కు పెను ప్రమాదం తప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి తన ప్రాణాలంటే లెక్కలేదని.. ఎన్నిసార్లు కోరిన కొత్త వాహనం ఇవ్వడం లేదని ఆరోపించారు. దానికి నిరసనగా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు రాజాసింగ్ తన బుల్లెట్ బండిపై వచ్చారు. దీంతో ఒక్కసారిగా షాక్ తిన్న పోలీసులు ఆయనను.. ఆపి.. పరిశీలించి లోపలికి పంపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story

Most Viewed