'ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎజెండా ఫిక్స్ చేయొద్దు'

by Disha Web Desk 2 |
ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎజెండా ఫిక్స్ చేయొద్దు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎమ్మెల్యేలకు తెలియకుండా ఎజెండా ఫిక్స్ చేయవద్దని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. శాసనసభ బిజినెస్ అడ్వాయిజరీ కమిటీ సమావేశానికి బీజేపీకి అనుమతించాలని కోరుతూ మంగళవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. బీజేపీ ఎమ్మెల్యే ఒక్కరు ఉన్నప్పుడు బీఏసీకి పిలిచారని ఇప్పుడు పిలువకపోవడం అన్యాయమన్నారు. ఇతర పార్టీలను బీఏసీకి ఆహ్వానించి బీజేపీని ఎందుకు పిలువడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్‌లు మూడు ఒక తాను ముక్కలేనని, ముగ్గురు మాట్లాడుకొని సభను వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. బీఏసీలో అనుమతిపై సీఎం, స్పీకర్‌ను కోరామని తెలిపారు. రూల్స్ సవరించారా? అని ఆడిగినట్లు తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed