ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: MLA పైలెట్ రోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా

by Disha Web Desk 19 |
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: MLA పైలెట్ రోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ వాయిదా
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ కేసు విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా వేస్తున్నట్లు సోమవారం తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తును రోహిత్ రెడ్డి గతంలో హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగింది. ఈడీ కౌంటర్ పై వాదనలకు గడువు కావాలని రోహిత్ రెడ్డి తరపు న్యాయవాది కోరారు. కాగా ఈ కేసులో రోహిత్ రెడ్డి గతంలో సంచలన ఆరోపణలు చేశారు.

నిందితుడు నందకుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ పేరుతో తనను ఇరికించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఈడీ అధికారులపై రోహిత్ ఆరోపణలు చేశారు. బీజేపీ కొత్త కుట్రలకు తెరలేపిందని అన్నారు. ఈ కేసులో ఇప్పటికే ఈడీ రోహిత్ రెడ్డిని రెండు రోజుల పాటు విచారించింది. ఎమ్మెల్యేల బేరసారాల అంశంపై ఫిర్యాదు చేసిన తనపైనే అధికారులు విచారిచడంలో మతలబు ఏంటని ప్రశ్నించారు. తనకు ఈడీ నోటీసులు ఇచ్చి విచారించడంపై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు.



Next Story

Most Viewed