కూతురు మరణవార్త విని స్పృహ తప్పిపడిపోయిన MLA లాస్య తల్లి

by Disha Web Desk 19 |
కూతురు మరణవార్త విని స్పృహ తప్పిపడిపోయిన MLA లాస్య తల్లి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగర శివారు పటాన్ చెరు సమీపంలోని ఓఆర్ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాదవశాత్తూ లాస్య ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఎమ్మెల్యే స్పాట్‌లోనే మృతి చెందారు. దీంతో కూతురు మరణవార్త విని ఎమ్మెల్యే లాస్య నందిత తల్లి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. లాస్య మరణవార్త తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

ఎమ్మెల్యేగా ఎన్నికైన 60 రోజుల్లోనే లాస్య నందిత వరుసగా ప్రమాదాలకు గురి కావడం.. తండ్రి చనిపోయిన ఏడాదిలోనే ఆమె కూడా మృతి చెందడంతో లాస్య కుటుంబంలో తీవ్ర విషాదచాయలు అలుముకున్నాయి. మరోవైపు లాస్య మృతదేహాన్ని పటాన్ చెరు నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి దేహానికి పోస్ట్ మార్టం చేయనున్నారు. మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి లాస్య ఇంటికి వెళ్లనున్నారు.



Next Story

Most Viewed