సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో లేఖ

by Disha Web Desk 19 |
సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరో లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్​ఎంపీ, పీఎంపీలను గ్రామీణ వైద్యులుగా గుర్తించాలని కాంగ్రెస్​ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. దీంతో పాటు ఐడీ కార్డులు కూడా ఇవ్వాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం వైఎస్​ హాయంలో కమ్యూనిటీ పారామెడిక్స్ ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పించారని, వారికి గత ప్రభుత్వం ఐడీ కార్డులు, సర్టిఫికేట్లు ఇవ్వలేకపోయిందన్నారు. బీఆర్‌ఎస్ ​అధికారంలోకి వచ్చాక ఇస్తామని హామీ కూడా ఇచ్చారని, ఎనిమిదేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో ప్రాథమిక వైద్యం అందించే వీళ్లకు గుర్తింపు ఉండాలన్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ సమస్యను లేవనెత్తినా అని, కానీ ప్రభుత్వం గుర్తించలేకపోయింనద్నారు.


Next Story

Most Viewed